టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినీతారలపై బయోపిక్ సినిమాలు రాలేదు. మొదటి సారిగా ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  మొదట్లో ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా..సినిమాకు సంబంధించిన ఒక్కో పోస్టర్ రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి.
Image result for mahanati latest posters
అంతే కాదు ఒక్కో క్యారెక్టర్స్ గురించి రివీల్ చేస్తూ..సినిమాపై మరింత ఆసక్తి పెంచారు చిత్ర యూనిట్.  నేడు విడుదలైన మహానటి చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, రాజమౌళి తొలిరోజే ఈ వీక్షించారంటే మహానటి చిత్రంపై సెలెబ్రెటీల్లో ఉన్న ఆసక్తి అర్థం అవుతుంది. ఈ సినిమా వీక్షించిన వెంటనే రాజమౌళి పట్టరాని ఆనందంతో తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
Related image
కీర్తి సురేష్ నటనని రాజమౌళి ఆకాశానికెత్తేశారు. తాను చూసిన అద్భుతమైన పెర్ఫామెన్స్ లలో కీర్తి సురేష్ నటన ఒకటని అన్నారు. కీర్తి సురేష్ సావిత్రి ఇమిటేట్ చేయలేదని, స్వయంగా సావిత్రినే మన కళ్ళముందుకు తీసుకువచ్చిందని ప్రశంసించారు. గొప్ప చిత్రాన్ని తీశారంటూ నాగ్ అశ్విన్, స్వప్నలను అభినందించారు. దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా ఉందని... అతనికి తాను ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోయానని ట్వీట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: