టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ ఎంత గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా చరిత్ర సృష్టించింది మగధీర. అంతకు ముందు పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమా ఉమ్మడి రాష్ట్రంలో రికార్డులు సృష్టించింది...అయితే ఆ రికార్డులు అధికమించింది మగధీర సినిమా.
ప్రస్తుతం పూరి తన తనయుడు ఆకాశ్ తో ‘మెహబూబా’సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 11న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు తెరపై ప్రేమకథలు ఒకదాని తరువాత ఒకటిగా పుట్టుకొస్తూనే ఉంటాయి .. యూత్ ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మనసును తాకే అంశాలు ఉండాలే గానీ .. ఇక ఆ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతూనే వుంటారు. అలాగే, ఓ ప్రేమకథతో 'మెహబూబా ' సినిమా రూపొందింది.
ఈ సినిమా పునర్జన్మతో కూడిన ప్రేమకథతో నడుస్తుందనే టాక్ బయటికి రాగానే, 'మగధీర'తో పోల్చుతూ రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ పూరి..మగధీర కథ వేరు అనీ .. 'మెహబూబా' కథ వేరు అని చెప్పాడు.
అయితే ఈ సినిమాలో పునర్జన్మకు సంబంధించిన పాయింట్ ఉంది..కానీ ఫాంటసీ తరహా కాదని..అసలు ‘మగధీర’ సినిమాకు ఏమాత్రం పోలిక ఉండదని..అనవసరంగా లేని పోని పుకార్లు సృష్టిస్తున్నారని వాపోయాడు. సినిమా చూశాక ఆ విషయాన్ని అంగీకరిస్తారని చెప్పుకొచ్చాడు.