పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్స్ పట్ల పెద్దగా ఆసక్తి కనపరచడు. అయితే ప్రస్తుతం సినిమాలను పక్కకుపెట్టి రాజకీయాల బాట పట్టిన పవన్ తన పద్ధతి పూర్తిగా మార్చేసుకున్నాడా అని అనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం  ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ లో సందడి చేసిన పవన్ ఇప్పుడు కూడ అదే జోరును కొనసాగిస్తూ ఈరోజు జరగబోతున్న రెండు సినిమాల ఫంక్షన్స్ కు అతిథిగా రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
NAAPERU SURYA MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈరోజు ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ ను సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ డక్కన్ లో జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు అతిథి గా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. అయితే ఇదేరోజు ఇంచుమించు ఇదే  సమయంలో రవితేజ ‘నేలటికెట్’ ఆడియోఫంక్షన్ జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు కూడ పవన్ ముఖ్య అతిథి. ఈవిషయాన్ని వారం ముందు నుంచే ఈమూవీ యూనిట్ వర్గాలు  ప్రచారంలో పెట్టారు. 
NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మాస్ మహారాజ మూవీ ఫంక్షన్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరగబోతోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. ఈసినిమా నిర్మాతకు పవన్ కు ఉన్న సాన్నిహిత్యంతో ఈఫంక్షన్ కు కూడ పవన్ ఖచ్చితంగా వస్తాడు అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ‘థాంక్స్ టు ఇండియా’ పేరుతో చేస్తున్న బన్నీ ఈవెంట్ కు అదేవిధంగా ‘నేలటికెట్’ ఫంక్షన్ కు ఒకేసారి పవన్ ఎలా వస్తాడు అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో ఈరెండు సినిమాల ఈవెంట్స్ ఒకే సమయంలో జరుగుతున్న నేపద్యంలో క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని అంటున్నారు. 
సంబంధిత చిత్రం
అయితే పవన్ కళ్యాణ్ ఈ రెండు కార్యక్రమాలకి ఏదైనా స్పెషల్ ప్లానింగ్ తో ఒకదానికి ముందు వచ్చి రెండోదానికి కాస్త ఆలస్యంగా వెళ్తాడా అనే విషయం పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఊహాగానాలు జరుగుతున్నాయి. దీనికితోడు ఈ రెండు ఈవెంట్స్ జరుగుతున్న వేదికల మధ్య దూరం కూడ మరీ అంత దగ్గర కాకపోవడంతో ఈ రెండు ఈవెంట్స్ ను కవర్ చేయడానికి పవన్ కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. పవన్ ఏఛానల్స్ ను చూడవద్దు అంటూ పిలుపు ఇచ్చాడో అదే ఛానల్స్ లో ఈ కార్యక్రమాల లైవ్ కవరేజ్ రాబోతూ ఉండటం అర్ధంకాని ట్విస్ట్..   



మరింత సమాచారం తెలుసుకోండి: