‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్..తర్వాత దేశముదురు, బన్ని,ఆర్య లాంటి సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ మద్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రేసు గుర్రం’ సినిమా నుంచి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ ఈ మద్య రిలీజ్ అయిన ‘నా పేరు సూర్య’ తో మరో విజయం అందుకున్నాడు.  దేశభక్తికి సంబంధించిన ఈ సినిమాతో బన్నీ వంద కోట్ల క్లబ్ లో చేరారు. గతంలో ‘రేసు గుర్రం’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 

Related image

శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. బన్నీ మేనరిజం పరంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘రేసు గుర్రం’ లాంటి ఎనర్జిటిక్ సినిమా సీక్వెల్ తీస్తే బాగుంటుందని బన్నీ ఎప్పటి నుంచి అనుకుంటున్నారట..కాకపోతే మొదటి సినిమాకి కథాపరమైన కొనసాగింపుగా కాకుండా, మరో కోణంలో కథ ఉంటుందని అంటున్నారు. 
Image result for surendar reddy allu arjun
ప్రస్తుతం సురేందర్ రెడ్డి..మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ బిజీలో ఉన్నారు.  ఈ సినిమా గనక మంచి సక్సెస్ సాధిస్తే..ఈ దర్శకుడిపై మరిన్ని అంచనాలు పెరుగుతాయి. ఆ తర్వాత ‘రేసు గుర్రం’ సీక్వెల్ వస్తే..వీరిద్దరికి మరో బిగ్గెస్ట్ హిట్ ఖాయమని అంటున్నారు.  ‘సైరా’ షూటింగ్ పూర్తయిన తర్వాత 'రేసుగుర్రం' సీక్వెల్ పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: