టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా చూసిన తర్వాత కొంత సేపటి వరకు తాను మంత్రముగ్దుడినయ్యానని..ఆ సినిమా షాక్ నుంచి చాలా సేపటి వరకు రిలీఫ్ కాలేకపోయాయని అన్నారు. ‘మహానటి’ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ సెలబ్రెటీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ‘మహానటి’ సినిమాను ప్రశంసించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. జీవితంలో మొట్టమొదటి సారి నేను డైరెక్టర్ను అయినందుకు గిల్టీగా ఫీలవుతున్నా అని అన్నారు. ఈ సినిమాను క్లాసిక్ అని మాత్రం అభివర్ణించలేమని..చూస్తున్నంత సేపు ఆ కాలంలో మనం ఉన్నామా అన్నంతగా ఫీలింగ్ కలుగుతుందని..మన తెలుగు చలన చిత్రం సీమలో ఇదో అద్భుతమైన చిత్ర కావ్యం అని అన్నారు.
ఇక ఈ సినిమా గురించి మాటల్లేవ్..నిజమైన సినిమాను అనుభూతి చెందినందుకు కన్నీళ్లు వస్తున్నాయి. చిత్ర యూనిట్, సాంకేతిక సిబ్బందిని పక్కన పెడితే కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండల నటనకు హ్యాట్సాఫ్ అన్నారు. ఇందులో నటించి ప్రతి క్యారెక్టర్ గురించి ఎంత పొగిడినా తక్కువే అన్నారు.
మంచి స్టార్ హోదాలో ఉన్న సమంత విలేఖరిగా నటించి మెప్పించారని..ఆమె నటన అద్భుతం అని అన్నారు... సమంత తన క్యారెక్టర్లో జీవించింది. పెళ్లి అనేది మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయగలిగే ధైర్యాన్ని, స్వేచ్ఛను అందిస్తుందని నిరూపించినందుకు సమంతకు హ్యాట్సాప్ అని అన్నారు.