ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ‘మహానటి’ మ్యానియాతో షేక్ అవుతోంది. సాధారణ ప్రేక్షకుల నుండి టాప్ సెలెబ్రెటీల వరకు ‘మహానటి’ ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉండటంతో ఈమూవీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనికితోడు ఈమూవీ టిక్కెట్లు ఈ వీకెండ్ దాకా అన్ని ధియేటర్లలోను అయిపోవడం చూస్తూ ఉంటే ‘మహానటి’ కలక్షన్స్ ఏ రేంజ్ కి వెళతాయి అన్న విషయం ఎవరి అంచనాలకు అందని విధంగా మారింది. 
SUKUMAR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో సుకుమార్ కు ‘మహానటి’ మూవీ ధియేటర్ లో ఎదురైన అనుభవం అందర్నీ ఆశ్చర్య పరిచే షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ ‘మహానటి’ మూవీని హైదరాబాద్ లోని ఒక ధియేటర్ లో చూసి బయటకు వస్తున్న సమయంలో ఒక మహిళ సుకుమార్ వద్దకు వడివడిగా వచ్చి ఈసినిమాను తీసింది మీరేనా అని ప్రశ్నించిందట. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దానికి సుకుమార్ నవ్వుతూ తానే ‘మహానటి’ ని తీసాను అని చెప్పిన అబద్దం నిజం అనుకుని నమ్మిన ఆ మహిళ సుకుమార్ ను గట్టిగా పట్టుకుని కౌగలించుకుని ఎంత బాగా మా సావిత్రమ్మని చూపించావు అంటూ కన్నీరు పెట్టుకున్న సంఘటనకు సుకుమార్ షాక్ అయిన సందర్భాన్ని బయటపెట్టాడు. దీనితో భావోద్వేగానికి గురైన సుకుమార్ ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ కు బహిరంగ ఉత్తరం వ్రాసి మీడియాకు విడుదల చేసాడు. 
సంబంధిత చిత్రం
"ప్రియమైన అశ్విన్.. మహానటి సినిమా చూసి బయటకొచ్చి నీతో మాట్లాడదామని నీ నంబర్ కు ట్రై చేస్తున్నా. ఇంతలో ఓ ఆవిడ వచ్చి నువ్వు డైరక్టరా బాబు అని అడిగింది. అవునన్నాను. అంతే నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. ఎంత బాగా చూపించావు బాబు మా సావిత్రమ్మని అంటూ. నేను కాదని ఆవిడకు చెప్పలేకపోయాను. ఆవిడ ప్రేమనంతా నేనే తీసేసుకున్నాను. ఆవిడ నన్ను దీవించింది. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను." అంటూ తన భావాలను సుకుమార్ నాగ్ అశ్విన్ తో పంచుకున్నాడు. అంతేకాదు తాను ఇలాంటి గొప్ప సినిమాను ఎందుకు తీయలేకపోయాను అంటూ ఈర్ష్య పడుతున్నట్లు సుకుమార్ వ్రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: