ఈ మధ్య రాజకీయనేతలకంటే సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఇండస్ట్రీలోని బడా హీరోలు, నిర్మాతలు అమ్మాయిలను వాడుకొని సినీ అవకాశాలు ఇవ్వడంలేదు అని శ్రీరెడ్డి ఉద్యమం చేపట్టగా ఆమె ముందడుగు వేయడం చూసి ఎంతోమంది ఇండస్ట్రీ మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలపై పెదవి విరుస్తున్నారు.


తాజాగా ఒక కోఆర్డినేటర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక జానియర్ ఆర్టిస్ట్ పోలీసులకు పిర్యాదు చేసింది. వివరాల్లోకివెళితే సదరు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని కోఆర్డినేటర్  శ్రీశాంత్ రెడ్డి ఆమెపై పరిచయం పెంచుకున్నాడు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్ 10న బోరబండలోని ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి, ఆమెను మాటల్లోపెట్టి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిపించి ఆమెపై అత్యాచారం చేసాడు.


అంతేగాక ఆమె డబ్బు, నగలు దోచుకొని పరారయ్యాడు. దీంతో ఒక సారి ఆమె చూసి గట్టిగా నిలదీయడంతో ఆ నగలు, డబ్బులు పెళ్లి కట్నం కింద రాసుకుంటానని ఆమెకు మాట ఇచ్చి తప్పించుకున్నాడు. కాగా చివరికి అతడు పెళ్ళికి నిరాకరించడంతో మోసపోయిన ఆమె సినీ ఆర్టిస్టులు శ్రీరెడ్డి, సునితారెడ్డి మరియు తదితరులతో కలిసివచ్చి నిన్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనే  శ్రీశాంత్ రెడ్డి కూడా ఆమెపై ఫిర్యాదు చేసేందుకు రావడంతో ఆమె సహనం కోల్పోయి అతడ్ని చెప్పుతో చితక బాదింది. దీంతో అక్కడున్న పోలీసులు పరిస్థిని అదుపులోకి తీసుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: