సావిత్రి బయోపిక్ గా మొదలు పెట్టిన నాటి నుండి మహానటిపై అంచనాలు భారెగా ఉన్నాయి. వైజయంతి బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటించి మెప్పించారు. మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది.


ఇక ఈ సినిమా చూసిన తెలుగు ఆడియెన్స్ ఇప్పటికే బరువెక్కిన హృదయాలతో మాట్లాడుతుంటే. సెలబ్రిటీస్ సైతం సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. రాఘవేంద్ర రావు, రాజమౌళి లాంటి దర్శకులు సినిమా ఓ అద్భుతమని ఒప్పుకోగా ఇప్పుడు ఆ లిస్ట్ లో నాని కూడా మహానటిపై ప్రశంసలు కురిపించాడు.


సినిమా ఎంత బాగుంది అంటే ఎంత బాగుందో చెప్పలేనంత అంటూ మొదలు పెట్టిన నాని కీర్తి సురేష్ గురించి ప్రస్థావిస్తూ ఈ పాత్రలో సావిత్రి గారు తప్ప కీర్తిలా ఎవరు నటించలేరని అన్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ ను చూస్తే చాలా గర్వంగా ఉందని సినిమాలో నటించిన దుల్కర్, సమంత, విజయ్, చైతు అందరికి థ్యాంక్స్ అని చెప్పాడు నాని.


నాచురల్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నాని మహానటిలో ప్రత్యక్షంగా భాగం కాకున్నా సరే నాగ్ అశ్విన్ మొదటి సినిమా హీరోగా సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమా గురించి అడిగి తెలుసుకునేవారట. మొత్తానికి నాని మహానటి టీం అందరిని పొగడ్తలతో ముంచెత్తడం సినిమాకు మరింత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: