ఈమధ్య కాలంలో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి బుర్రా సాయి మాధవ్. తన మాటలతో మనసు లోతుల్లో కదలికలు తెచ్చేలా చేసే రచయిత ఆయన. మళ్లీ మళీ ఇది రాని రోజు సినిమా అంత బాగా ఆడిందంటే అది సాయి మాధవ్ మాటల పనితనం వల్లే. ఇక ఈ రైటర్ కు చేతినిండా అవకాశాలు ఉన్నాయి.


ఎలా వచ్చిందో ఏమో కాని సాయి మాధవ్ బుర్రా పచ్చి తాగుబోతన్న వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ విషయం గురించి స్వయంగా ఆయనే స్పందించారు. అవును నేను తాగుతా కాని 24 గంటలు కాదు కేవలం రాత్రి 8 దాటాక ఏదో అలా కొద్దిగా తాగుతా అంటున్నాడు సాయి మాధవ్ బుర్రా.


ఖైది నంబర్ 150తో పాటుగా సైరా నరసింహారెడ్డి ఛాన్స్ కూడా అందుకున్న ఈయన పనితనం అందరికి నచ్చింది. అంతేకాదు కోడి రామ్మూర్తి బయోపిక్ తో పాటుగా మోహన్ బాబు కన్నప్పకు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాకు సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఆయన పెన్ పవర్ బాగుంది కాని ఈ తాగుడు అలావాటే బాగాలేదని అందరు అంటున్నారు.


ఆయనంతట ఆయనే నేను రోజు తాగుతా రోజంతా కాదు రాత్రి వేళ మాత్రమే అంటున్నాడు. మరి ఈ రైటర్ కు తాగుడు ఎందుకు అలావాటుగా మారిందో తెలియదు కాని ఆయన మారడానికి ఏమైనా సందర్భం దొరికితే మంచిదని అంటున్నారు. రానున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లలో సాయి మాధవ్ పెన్ పవర్ ఎక్కువ స్కోప్ దొరుకుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: