మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అన్నది తెలిసిందే. చరణ్ కెరియర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి నాన్ బాహుబలి రికార్డులను సైతం తన పేరున రాసుకున్న చిట్టిబాబు సంచలనం సృష్టించాడు. కరెక్ట్ సినిమా పడితే చరణ్ స్టామినా ఏంటో రంగస్థలం ప్రూవ్ చేసింది.


రంగస్థలం 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దుమ్మురేపగా ఇప్పుడు ఆ సినిమా క్రేజ్ తో బోయపాటి శ్రీను సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో రాం చరణ్ చేస్తున్న సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఫుల్ పాక్డ్ మాస్ మూవీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట.


తెలుగులోనే కాదు నార్త్ ఇండియాకు సంబందించిన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బోయపాటి, చరణ్ కాంబినేషన్ లో సినిమాను ఏకంగా 21 కోట్లతో కొనేశారట. ఓ తెలుగు సినిమా రైట్స్ నార్త్ ఇండియాలో ఈ రేంజ్ లో వెళ్లడం అది చరణ్ కెరియర్ లో బీభత్సమైన రికార్డ్ అని చెప్పొచ్చు. రంగస్థలం లో చిట్టిబాబుగా తన నట విశ్వరూపం చూపించిన చరణ్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని అంటున్నారు.   


ఇక స్టార్స్ తో బోయపాటి శ్రీను చేసే సినిమాలు ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాయో తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. మరి రిలీజ్ ముందు రికార్డులు క్రియేట్ చేస్తున్న బోయపాటి చరణ్ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు రాజవంశస్థుడు, రాజమార్తాండా టైటిల్ పరిశీలణలో ఉంచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: