తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కొంత కాలంగా పోరాటం కొనసాగిస్తున్న నటి శ్రీరెడ్డి ఆ మద్య పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు మద్దతు ఇచ్చిన వారు..పక్కకు తప్పుకున్నారు. అంతే కాదు సోషల్ మీడియా వేధికగా పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీడియా ఛానల్స్ కూడా శ్రీరెడ్డితో ఇంటర్వ్యూలో తీసుకోవడం పూర్తిగా తగ్గించుకున్నారు. దాంతో ఆమె ఇంటి నుంచి సోషల్ మీడియాలో స్పందిస్తూ..సంచలన పోస్ట్ లు చేస్తూ వస్తుంది.
సినీ రంగంలో మహళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నటి శ్రీరెడ్డి వివిధ మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నంకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ... తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్లోనూ ఫిర్యాదు చేస్తానన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ పరిశ్రమలోని పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరిస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ హామీ ఇచ్చారని చెప్పారు.త్వరలో ఢిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్ను కూడా కలిసి ఈ విషయంపై పిర్యాదు చేస్తామన్నారు. టాలీవుడ్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని తెలిపిన మహిళా సంఘాల నేతలు.. ఆ కారణంగా ఏ సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం దొరకటం లేదని తెలిపారు.