ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ పాలన కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారని  ప్రముఖ సినీ హాస్య నటుడు, పృథ్వీరాజ్‌ జోస్యం చెప్పారు. నేడు శుక్రవారం కొత్తపేటలోని తన మిత్రుడు పెద్దింటి రామం ఇంటికి వచ్చిన సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వాఖ్యలు చేశాడు.


గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రం, చంద్రబాబుకు ఉన్న అనుభవం, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాడన్న హామీతోనే ఆయను నమ్మి  ప్రజలు  ఓట్లేశారని తెలిపాడు. అయితే నాలుగేళ్లుగా చంద్రబాబు ఏదో చేస్తాడని ఆశపడ్డ ప్రజలకు ఇప్పుడు ఆయన ఏమీ చేయడని అర్థమయిపోయిందని ఎద్దేవా చేశాడు. అందుకే ఈ సారి జగన్ మీద పూర్తి నమ్మకంతో ఓట్లువేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.


నీతి నిజాయితీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, ఎమ్మెల్సీ శిల్పామోహన్‌రెడ్డితో పదవికి రాజీనామా చేయించిన తర్వాతే ఆయనను వైసీపీలోకి అడుగుపెట్టించారని ఆయన తెలిపాడు. ఇటీవల తలెత్తిన శ్రీరెడ్డి వివాదంపై స్పందిస్తూ అది అర్ధరహితం అని వాఖ్యానించారు. స్వర్గీయ దాసరి నారాయణరావు గారు బ్రతికి ఉంటే ఇలాంటి వివాదాలు జరిగేవే కావని ఆయన దాసరి గారిని గుర్తుచేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: