సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి తన కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘ఆఫీసర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించాడు.నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా మైరా సరీన్ కనిపించనుంది. ప్రతి మనిషిలో దేవుడు, రాక్షసుడు ఇద్దరూ ఉంటారు’ అంటూ ఆఫీసర్ ట్రైలర్‌తో వచ్చేశారు కింగ్ నాగార్జున.

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్’ మూవీ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు నాగార్జున.  ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇక తాజా ట్రైలర్‌లో వర్మ స్టైల్‌‌లోనే సాగింది. బాంబ్ బ్లాస్ట్‌లు, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా బాగానే క్యారీ చేశారు వర్మ.

‘వాడు హైదరాబాద్ నుండి ముంబైలో మనల్ని పీకుతాడా? ఈ జాబ్ చేయడం అవసరమా? అని చిన్న పాప అడిగితే ‘నేను పారిపోలేనమ్మా?’ అంటూ నాగ్ ఎమోషన్ అవ్వడం.. గ్యాంగ్‌‌స్టర్ల నుండి తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే వాళ్లను ఎలా అంతమొందించారన్నదే చిత్ర కథ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.  ప్పటికే రెండు టీజర్‌లను రిలీజ్‌ చేసిన యూనిట్‌ తాజాగా రెండు నిమిషాల నిడివితో ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. వర్మ మార్క్‌ యాక్షన్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌లో నాగార్జున్‌ స్టైలిష్ కాప్‌గా ఆకట్టుకున్నాడు.   

ఆర్జీవీ కంపెనీ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ్, వర్మ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది. గతంలో ‘శివ’, ‘గోవిందా గోవింద’, ‘అంతం’ సినిమాలు వీరి కాంబినేషన్‌లో రాగా.. ‘ఆఫీసర్’ మే25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో నాగ్ సరసన నాగ్ స‌ర‌స‌న మైరా స‌రేన్ మోడల్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: