‘మహానటి’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలను చిరంజీవి తన ఇంటికి పిలిపించుకుని సత్కరించిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవి ఒక మీడియా సంస్థ ప్రతినిధి పై ప్రదర్శించిన అసహనం హాట్ న్యూస్ గా మారింది. ఈ సమావేశంలో చిరంజీవి ‘మహానటి’ సినిమా గురించి ఉద్వేగంగా మాట్లాడుతున్నప్పుడు ఒక మీడియా సంస్థ ప్రతినిధి చిరంజీవితో ఎదో ఒకమాట అడగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అసహనానికి లోనైన చిరంజీవి ఆమీదియా సంస్థ ప్రతినిధి వైపు సీరియస్ గా చూస్తూ ‘డోంట్ డిస్ట్రబ్’ అంటూ సున్నితంగా హెచ్చరించాడు.
Chirnajeevi Feciliated Mahanati
అయితే ఇప్పుడు చిరంజీవి ప్రవర్తన పై మీడియాలోని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నాయి. ఆమీడియా సంస్థ ప్రతినిధి అడగబోతున్న ప్రశ్న ఏమిటో తెలుసుకోకుండా ‘డోంట్ డిస్ట్రబ్’ అంటూ వార్నింగ్స్ ఇవ్వడం ఏమిటి అంటూ కొందరు మీడియా వర్గాల ప్రతినిధులు కామెంట్ చేసుకుంటున్నారు. 
Chirnajeevi Feciliated Mahanati
అంతేకాదు కొద్దిరోజుల క్రితం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కొన్ని ప్రముఖ ఛానల్స్ ను చూడవద్దు అంటూ పిలుపు ఇచ్చిన వ్యవహారం పై ఇంకా వేడి చల్లారకుండానే ఇలా చిరంజీవి మీడియా ప్రతినిధి పై తన అసహనాన్ని చూపించడం ఏమిటి అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ హీరోలకు మీడియా సంస్థల పై గౌరవం లేదు అన్న విషయం మరొకసారి ఈ లేటెస్ట్ సంఘటన రుజువు చేస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 
pavan kalyan latest photos కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మీడియా వర్గాలతో అంత సాన్నిహిత్యం లేని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమ్యూనిస్టు భావాలతో కొందరు కమ్యూనిస్టు పార్టీ సన్నిహితులు నిర్వహిస్తున్న ఒక ప్రముఖ ఛానల్ ను కొని ఆ ఛానల్ ను తన ‘జనసేన’ ఛానల్ గా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలే నిజం అయితే ‘జనసేన’ పార్టీకి మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ హీరోలకు వత్తాసు పలికే న్యూస్ ఛానల్ గా ఈ ఛానల్ మారుతుంది అన్న గాసిప్పులు వస్తున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: