తన భార్య కిడ్నీ కోసం ఓ జూనియర్ ఆర్టిస్టుని మోసం చేసిన కేసులో వెండితెర, బుల్లి తెర నటుడు బాలాజి పై కేసు నమోదు అయ్యింది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూనియర్ ఆర్టిస్ట్ అయిన భాగ్యలక్ష్మి తనను మభ్యపెట్టి కిడ్నీని తీసుకుని తన భార్యకు అమర్చుకున్నారని బాలాజీపై   ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలు, టీవీల్లో అవకాశాలతో పాటు రూ. 20 లక్షలు, ఆపై నెలకు రూ. 15 వేలసాయం చేస్తామని బాలాజీ చెప్పాడని, ఆపై పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. 
Image result for actor balaji police car\
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు కిడ్నీ దానం విషయంలో భాగ్యలక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్ట్‌ను మోసం చేసిన కేసులో బుల్లితెర నటుడు బాలాజీ మోసం చేసినట్లు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యం అయ్యాయి.

అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవాడలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసును విచారించిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న అనంతం ఐపీసీ సెక్షన్ 420తో పాటు మానవ అవయవాల మార్పిడి చట్టం 1994లోని సెక్షన్ 19 ప్రకారం శిక్ష నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు బదిలీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: