ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న మహానటి టీం ఇండస్ట్రీ మొత్తం నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మహానటి టీం ను సత్కరించగా ఆదివారం సాయంత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు మహానటి టీం కు స్పెషల్ ట్రీట్ ఎరేంజ్ చేశారు.


సావిత్రి బయోపిక్ గా అంచనాలకు మించి వసూళ్లను రాబడుతున్న మహానటి టీం విజయానందాన్ని ఎంజాయ్ చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా స్వప్న సినిమాస్ బ్యానర్లో ప్రియాంకా దత్ నిర్మించారు. మహానటి టీంకు బన్ని స్పెషల్ డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మహానటి టీం తో పాటుగా రాజమౌళి, కీరవాణి కూడా పాల్గొన్నారు. 


ఇక మరోపక్క అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్నికు సూర్య సినిమా షాక్ ఇచ్చిందని చెప్పాలి. వక్కతం వంశీ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మించారు. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. 


బన్ని తర్వాత సినిమాల విషయంలో కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం విక్రం కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే నా పేరు సూర్య సినిమా రిజల్ట్ తో తీయబోయే సినిమాపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. 



మరింత సమాచారం తెలుసుకోండి: