ఏ ముహుర్తాన మహానటి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలని అనుకున్నారో కాని సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా ప్రేక్షక నీరాజనాలతో బాక్సాఫీస్ షేక్ చేసే కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ మహానటి మూవీ అశ్వనిదత్ నిర్మాణంలో ప్రియాంకా, స్వప్నా దత్ లు నిర్మించారు.


ఇక సావిత్రి గారిగా కీర్తి సురేష్ అభినయం అందరిని ఆశ్చర్యపరచేలా చేసింది. సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని తెలిసినా ఓవరాల్ గా మనసుని తాకే సినిమాగా మహానటి చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఈ సినిమా కేవలం క్లాసూ.. మాసూ అన్న తేడా లేకుండా దూసుకెళ్తుండటం విశేషం.


ఇప్పటికే ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ అందుకోగా బి, సి సెంటర్స్ లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాలను తీసి మహానటి సినిమా వేస్తున్నారట. రిలీజ్ రోజు నుండి ఇప్పటికే 25 శాతం థియేటర్స్ పెరిగాయని తెలుస్తుంది.


ఇది మహానటికి ప్రేక్షకులిచ్చిన కానుక. తమ మనసుల్లో ఎప్పుడూ ఆమె నిలిచి ఉంటుందని రుజువుచేశారు. 40 సంవత్సరాల తర్వాత కూడా స్టార్స్ లేకుండా బాక్సాఫీస్ పై చెడుగుడు ఆడిస్తుంది అంటే ఆ మహానటి సత్తా ఏంటో తెలుస్తుంది. మరి ఈ సినిమా కలక్షన్స్ చూస్తుంటే సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. అది ఎందాకా వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: