తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ మంచి విజయం సాధించి కలెక్షన్లు రాబడుతుంది.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ లో వచ్చిన చిత్రానికి మంచి క్రేజ్ లభించింది.  ప్రస్తుతం మహేష్ ‘భరత్ అనే నేను’ విజయాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారు..ఈ నేపథ్యంలో కుటుంబంతో ఆయన ఫారిన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.  త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్ బాబు.
Image result for mahesh babu sukumar
ఈ చిత్రం పూర్తి కాగానే దర్శకులు సుకుమార్ తో మరో చిత్రానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.  రాంచరణ్ తో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మంచి ఫామ్ లో ఉన్న సుకుమార్ త్వరలో మహేష్ బాబు తో చిత్రం చేయడం ఫ్యాన్స్ కి సంతోషకరమైన విషయమే.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనొక్కడినే’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. మొన్నటివరకు తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామంలో కొన్ని రోజులు గడిపిన సుకుమార్.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాడు.
Image result for mahesh babu sukumar
మహేష్, సుకుమార్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయిన విషయం తెలిసిందే. సుకుమార్ చెప్పిన మూడు స్టోరీలైన్స్ లో ఒక లైన్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  తన తదుపరి చిత్రంలో ఇప్పటివరకు మహేష్ పోషించని ఓ సరికొత్త పాత్రను సృష్టించాడట సుకుమార్. రంగస్థలంకు విలేజ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్న సుక్కూ, మహేష్ మూవీకి మాత్రం అర్బన్ బ్యాక్ డ్రాప్ నే సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టు రాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: