ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో సినీ తారలకు సంబంధించిన బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన నటనతో కీర్తీ ప్రతిష్టలు సంపాదించిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా తెరకెక్కించారు.  ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.  సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని..జెమినీ గణేషన్ గా దుల్కన్ సల్మాన్ నటన అద్భుతమని ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు. 

keerthi suresh visits Tirumala Today

‘మహానటి’ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న మళియాళ భామ కీర్తి సురేష్ ఇవాళ తిరుమలను సందర్శించింది. కీర్తిసురేశ్ తిరుమల శ్రీవారిని వీఐపీ విరామసమయంలో దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దగ్గరుండి కీర్తి సురేశ్ కు దర్శన ఏర్పాట్లు చేశారు. 

దర్శనానంతరం ఆమెకు ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కీర్తిసురేశ్ ను పట్టువస్త్రంతో సత్కరించారు.  ఈ  సందర్భంగా కీర్తి మీడియాతో మాట్లాడుతూ..మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.  సినీ చరిత్రలో ఆమెకు ఎంత గొప్ప స్థానం ఉందో ఈ సినిమా చేసే సమయంలో తనకు తెలిసిందని..అంత గొప్ప నటి పాత్రలో చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని అన్నారు. 
Image result for mahanati
చాలా మంది సావిత్రిని చూసినట్లు ఉందని అనడంత తన జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అని..ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారని అందుకే సినిమా అంతగొప్ప విజయం సాధించిందని అన్నారు.  దర్శకులు నాగ్ అశ్విన్, నిర్మాతలకు, సహనటుల కు కృతజ్ఞతలు తెలిపారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: