టాలీవుడ్ లో కొందరు దర్శకులు ఇలా వచ్చి అలా హిట్లు కొట్టేస్తుంటారు. ఒకటి రెండు సినిమాలకే స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా పొందుతారు. అలాంటి వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. మొదటి సినిమా కొత్త బంగారు లోకం సినిమా తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసి హిట్ కొట్టాడు. 


వెంకటేష్, మహేష్ మల్టీస్టారర్ సినిమాను శ్రీకాంత్ హ్యాండిల్ చేసిన విధానం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక అదే ఉత్సాహంతో మహేష్ తో బ్రహ్మోత్సవం చేసినా భారీ డిజాస్టర్ గా మిగిలింది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ మహేష్ ను చాలా వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా మీద మహేష్ చాలా హోప్స్ పెట్టుకోగా అది కాస్త తుస్సుమనేసరికి ఇరకాటంలో పడ్డాడు మహేష్. 


ఇక ఆ సినిమా తర్వాత మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ కూడా నిరాశ పరచడంతో భరత్ అనే నేను మీద బాధ్యత పెరిగింది. అయినా సరే కొరటాల శివ భరత్ అనే నేనుని అభిమానుల అంచనాలకు తగినట్టుగా తీసి హిట్ కొట్టాడు. భరత్ అనే నేను రికార్డుల విషయం తెలిసిందే.


ఆ విషయం పక్కన పెడితే బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఈమధ్యనే ఓ కథను రెడీ చేసి శర్వానంద్ కు వినిపించాడట. శర్వాకు కథ నచ్చిందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ వారు శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్లా డైరక్టర్ అయినా శ్రీకాంత్ ఈసారి వారి నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: