సీనీ ఇండస్ట్రీలో నటి ఐశ్వర్యారాయ్ ఓ అపురూపం..ఆమె అందానికి ఫిదా కాని వారు ఎవరూ ఉండారు..అంతే కాదు నువ్ ఐశ్వర్యలా ఉన్నావా అంటూ పోల్చుతుంటారు..అంతటి సౌందర్యవతి అయినా..ఓ బిడ్డకు తల్లే. తాజాగా కేన్స్ చలన చిత్రోత్సవాలకు వెళ్లేటప్పుడు నటి ఐశ్వర్యారాయ్ ముద్దుల తనయ ఆరాధ్యను తీసుకొని వెళ్లింది. కేన్స్ 71వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కన్నుల పండుగగా సాగిపోతోంది. ఫ్రాన్స్లోని రివేరా నదీ తీరంలో జరుగుతున్న ఈ వేడుకకి ప్రపంచ నలుమూల నుంచి సినీ ప్రముఖులు రావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి.
అందాల తారల హోయలొలికిస్తూ రెడ్కార్పెట్పై నడిచారు. ఈ ఉత్సవంలో హాలీవుడ్ తారలతో పాటు భారతీయ తారలు పాల్గొన్నారు. ఈ ఏడాది పలువురు భారతీయ తారలు ఉత్సవానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, హ్యూమా ఖురేషి, నవాజుద్దీన్ సిద్దిఖీ, ధనుష్, మల్లికా షెరావత్, నందితా దాస్ తదితరులు ఈ చిత్రోత్సవంలో సందడి చేయబోతున్నారు. ఈ సంవత్సరం కేన్స్ చిత్రోత్సవంలో పోటీ పడుతున్న 21 చిత్రాల్లో ఇండియా నుంచి నాలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి.
అస్సామీ నుంచి "విలేజ్ రాక్ స్టార్స్", మలయాళం నుంచి "భయానకం", బెంగాలీ నుంచి "నగర్ కీర్తన్", లక్షద్వీప్ నుంచి "సింజర్" చిత్రాలు పోటీ పడుతున్నాయి. స్పానిష్ చిత్రం అయిన "ఎవ్రీబడీ నోస్" చిత్రం ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైంది.