గతవారం ‘మహానటి’ మూవీతో పోటీగా విడుదలైన ‘మెహబూబా’ చిత్రం పూరి అభిమానులను కూడ నిరాశపరిచింది. అయితే ఈసినిమా సక్సస్ అయింది అంటూ పూరి జగన్నాథ్ ఈమూవీ సక్సస్ మీట్ ను నిర్వహించడమే కాకుండా తన ఉపన్యాసం చివరిలో ‘జై బాలయ్య’ నినాదాలు చేయడంతో ఈ సక్సస్ మీట్ ను కవర్ చేయడానికి వచ్చిన మీడియా సంస్థల ప్రతినిధులు కూడ షాక్ అయినట్లు టాక్.
అంతా మెచ్చుకుంటున్నారు
ఇండియా పాకిస్తాన్ వార్ నేపధ్యంలో ప్రేమ కథను చూపెడుతూ గత జన్మల స్టోరీని నమ్ముకుని పూరి తీసిన ఈమూవీకి ఘోరమైన టాక్ వచ్చింది. సుమారు 20 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీకి 80 శాతం పైగా నష్టాలు వస్తాయి అని అంటున్నారు. 
తెలుగు రాష్ట్రాల్లో కూడా
అయితే ఈవిషయాలను అర్ధం చేసుకోకుండా తన మూవీ పై మీడియా వర్గాలు నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నాయి అంటూ పూరి కామెంట్స్ చేయడమే కాకుండా ఈచిత్రానికి యూఎస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది అంటూ షాకింగ్ కామెంట్ చేసాడు పూరి. అంతేకాదు ఈమూవీ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన మీడియా వర్గాలు కూడ తన కొడుకు ఆకాష్ నటనను మెచ్చుకున్నాయి అంటూ రాబోయే కాలానికి ఫ్యూచర్ స్టార్ ఆకాష్ అంటూ పూరి కామెంట్స్ చేసి మరొక షాక్ ఇచ్చాడు. 
 సినిమా తీసిందే అందుకు
ఇది చాలదు అన్నట్లుగా ఈసినిమా మొదలైన దగ్గర నుండి అనేక సార్లు బాలకృష్ణ తనకు ఫోన్ చేసి ఈసినిమా ఎలా వస్తోంది అని అడగడమే కాకుండా తనను ఎంతగానో బాలయ్య ప్రోత్సహించాడని చెపుతూ తన ఉపన్యాసం చివర ఉద్వేగంతో జై బాలయ్య నినాదాలు చేసాడు పూరి. ప్రస్తుతం పూరి పేరు చెపితే హీరోలందరూ పారిపోతున్న నేపధ్యంలో తాను ఒకేసారి పది కథలను టాప్ హీరోల కోసం వ్రాసే పనిలో బిజీగా ఉన్నాను అని పూరి అంటున్న నేపధ్యంలో అసలు పూరీకి ఏమైంది అంటూ ఇందాస్త్రీలోని కొన్ని వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: