తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి కళ్యాన్ రామ్..ఓ వైపు నిర్మాతగా కొనసాగుతూనే హీరోగా నటిస్తున్నాడు.  ఈ మద్య కాజల్ తో నటించిన ‘ఎమ్మెల్యె’ కాస్త పరవాలేదు అనిపించింది. తాజాగా కళ్యాన్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’. మిళ దర్శకుడు జయేంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Image result for naa nuvve kalyan ram
త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘ నా నువ్వే’ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ బుధవారం నాడు విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపింది.  గత చిత్రాలకు భిన్నంగా ఫ్రెష్ లుక్‌లో అలరిస్తూ.. స్క్రీన్‌పై అసలు సిసలు రొమాన్స్ ఎలా పండించాలో ‘నా నువ్వే’ ట్రైలర్‌లో చూపించారు.
Image result for naa nuvve kalyan ram
ఓ అందమైన ఆర్జే అనుకోకుండా ప్రేమలో పడటం.. ఆ తరువాత ఆ అబ్బాయితో కలిసి సహజీవనం చేయడం.. ఆ తరువాత అనుకోని కారణాలతో విడిపోవడం.. తిరిగి ఆ అబ్బాయిని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటం లాంటి అంశాలతో  ఈ చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.

‘నా ప్రేమ, నా బాధ అందరికీ వినపడుతుంది.. నీకు వినిపించడం లేదా? అని తమన్నా.. కళ్యాణ్ రామ్ కోసం తపంచే క్షణంలో.. ‘తపించే క్షణాలకు నిరాశే చూపించకు’ అంటూ స్లో వాయిస్‌లో ‘నా నువ్వే’ అంటూ బ్యాగ్రౌండ్‌లో లిరిక్ వినిపించడం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు శరత్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ మూవీని మే 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ట్రైలర్‌లో కమ్మింగ్ సూన్ అనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: