ఈరోజుల్లో సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసి ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరక్టర్ మారుతి. ప్రస్తుతం నాగ చైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్న మారుతి ఆ సినిమా తర్వాత మెగా మేనళ్లుడితో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇప్పటికే సాయి ధరం తేజ్ కు కథ చెప్పాడట.


మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న టాక్ వచ్చింది. సినిమా అనుకున్న విధంగా రీచ్ అయితే హీరో కెరియర్ బెస్ట్ హిట్ అందుకున్నట్టే. నాచురల్ స్టార్ నానికి భలే భలే మగాడివోయ్ సినిమా కెరియర్ కు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ సినిమాతోనే నాని నాచురల్ స్టర గా స్క్రీన్ నేం వేసుకోవడం మొదలుపెట్టాడు.


రాబోతున్న శైలజా రెడ్డి కూడా చైతు కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని చెబుతున్నారు. ఇక కొన్నాళ్లుగా మెగా మేనళ్లుడు హిట్ సినిమాలకు దూరమయ్యాడు. రిలీ ముందు అంచనాలు పెరగడం రిలీజ్ తర్వాత తుస్సుమనడం ఇది కామన్ అయ్యింది. అయినా సరే మెగా ఫ్యాన్స్ లో ఈ సుప్రీం హీరోకి మంచి ఫాలోయింగ్ ఉంది. 


ఇప్పుడు మారుతి ఆ క్రేజీ ఫ్యాన్స్ కు సరితూగే కథను అందించేందుకు సిద్ధమయ్యాడట. మారుతి స్కెచ్ లో తేజూ పడ్డాడని అంటున్నారు. ప్రతుతం కరుణాకరణ్ డైరక్షన్ లో తేజూ ఐ లవ్యూ సినిమా చేస్తున్న తేజ్ ఆ తర్వాత మారుతి సినిమానే చేస్తాడని అంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: