కళ్యాణ్ రాం హీరోగా జయేంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా నా నువ్వే. పిసి శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేతున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యింది. శరత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. మే 25న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ స్టార్ హీరోలకు షాక్ ఇస్తుంది.


కళ్యాణ్ రాం లవర్ బోయ్ గా నటించిన నా నువ్వేలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 7 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగులో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం స్టార్ హీరోల సినిమాలకే ఈ రేంజ్ వ్యూస్ వస్తాయి. అంతేకాదు బాహుబలి తర్వాత కళ్యాణ్ రాం నా నువ్వే అత్యధిక వ్యూయర్ కౌంట్ సాధించడం విశేషం.


నా నువ్వే 24 గంటల్లో 7 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. బాహుబలి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూయర్ కౌంట్ సాధించగా దాన్ని కూడా బీట్ చేసి ఏకంగా టాప్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది నా నువ్వే. రేడియో జాకీగా పనిచేసే హీరోయిన్ హీరోని ప్రేమిస్తుంది.  


అదే విషయాన్ని తనతో చెబుతుంది కాని ఆమె ప్రేమను అంగీకరించని హీరో చివరకు ఏం చేశాడు అన్నది సినిమా కథ. సిద్ధార్థ్ 180 సినిమా తర్వాత యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన జయేంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. మరి ట్రైలర్ తో సంచలనం సృష్టించిన కళ్యాణ్ రాం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: