యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. అయితే రేపు ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఈ రోజు సాయంత్రం 4:50గంటలకు చిత్ర ఫస్ట్ లుక్తో పాటు టైటిల్కి సంబంధించిన పోస్టర్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.రాయలసీమ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.
ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకి 'అసామాన్యుడు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ కి ఫీడ్ బ్యాక్ సరిగ్గా రాకపోవడంతో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరింత స్లిమ్ గా ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ మేకప్ విషయంలోను ప్రత్యేకత కనిపించనుంది.
తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు. అసామాన్యుడు, సింహానంద అనే టైటిల్స్ ఇటీవల తెరపైకి రాగా, రారా కుమారా అనే టైటిల్ని ఎన్టీఆర్ మూవీకి ఫిక్స్ చేశారని అంటున్నారు. మరి కొద్ది గంటలలో దీనిపై క్లారిటీ రానుంది.
త్రివిక్రమ్ సెల్యులాయిడ్ దూసుకొస్తుందని టీం చెబుతుండగా, ఈ మూవీ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ఆనందాన్ని పదింతలు చేసేలా ఉంటుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.