తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ‘మహానటి’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.  తెలుగు తెరపై మొదటి సారిగా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  అయితే ఈ సినిమా పై మొదట్లో ఎన్నో అనుమానాలు వచ్చినా..ఆమె జీవిత కథ లో ఏవైనా కాంట్రవర్సీలు ఉంటాయని పుకార్లు వచ్చినా..వాటన్నింటికి చెక్ పెడుతూ ‘మహానటి’ థియేలర్లో రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 
Image result for mahanati
కథ, కథనంతో పాటు ప్రధానపాత్రాధారుల నటన, దర్శకత్వం, సంగీతం ఇలా ప్రతి విభాగంలోనూ సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రకు జీవం పోసిందని..ఎక్కడా ఏమాత్రం విమర్శలకు తావివ్వకుండా సినిమా ఎంతో అద్బుతంగా తీర్చి దిద్దారని టాక్ వినిపించింది. 
Image result for mahanati
కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో కనిపించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, క్రిష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది మహానటి. ఇక మహానటి సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ, రాజకీయ నాయకులు కూడా ఎంతో మెచ్చుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: