తెలుగు ఇండస్ట్రీలో డి రామానాయుడు ఫ్యామిలీ నుంచి వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యారు.  ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించిన వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అయితే గత కొంత కాలంగా వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.  మహేష్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాల చిత్రాల్లో నటించారు వెంకటేష్.  ఇక బాబు బంగారం, గురు చిత్రాల్లో సోలోగా నటించారు.  ప్రస్తుతం తెలుగు  ఇండస్ట్రీలో ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి.
Image result for director bobby venkatesh
సీనియర్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి వైవిధ్యమైన కథలతో విభిన్న చిత్రాలు చేస్తున్నారు. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. కేఎస్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసారని, చైతూ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంద‌ని అన్నారు.
Image result for director bobby venkatesh
కాని తాజా స‌మాచారం ప్ర‌కారం చైతూ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. ఇదే క‌నుక నిజ‌మైతే వీరిద్ద‌రు క‌లిసి న‌టించడం రెండో సారి అవుతుంది. 2017లో వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్ధాం చిత్రంలో చైతూ, ర‌కుల్ జంట‌గా న‌టించారు.   జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. 
Image result for rarandoi veduka chuddam
వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఈ వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: