ఎన్.టి.ఆర్ త్రివిక్రం కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'అరవింద సమేత' ఫస్ట్ లుక్ రిలీజ్ నాడే ఈ సినిమాకు భారీ ఆఫర్ రావడం విశేషం. ప్రస్తుతం తెలుగు సినిమాల బాక్సాఫీస్ లెక్కల్లో యూఎస్ మార్కెట్ కూడా పెద్ద పాత్ర వహిస్తుంది ఈ టైంలో యంగ్ టైగర్ సినిమా అక్కడ భారీ రేటుకి అమ్ముడవడం విశేషం.

d

అది కూడా కేవలం ఓ ఫస్ట్ లుక్ చూసి భారీ రేటుకి దక్కించుకోవడం విశేషం. నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను చాలా తెలివిగా మార్కెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమాకు యూఎస్ లో భారీ క్రేజ్ ఉంటుంది అందుకే ఈ సినిమాను 18 కోట్లకు అమ్మేశారట. అయితే బోనస్ గా ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య శైలజా రెడ్డి, శర్వానంద్ సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న సినిమా కూడా ఇందులో కలిపేశారట. 


మూడు సినిమాలకు కలిపి 18 కోట్లు కోట్ చేశారట. ఇండివిడ్యువల్ గా చూస్తే ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాకు 12 కోట్ల దాకా డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే యూఎస్ మార్కెట్ లో చలనం తెప్పించిన యంగ్ టైగర్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని ప్రభంజనాలు సృష్టిస్తారో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె లీడ్ హీరోయిన్ కాగా శ్రద్ధా కపూర్ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: