సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుందని చెప్పొచ్చు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను కియరాకు తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మహేష్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.


ఇక బాలీవుడ్ లో ఆమె సగటు హీరోయిన్ మాత్రమే కాని టాలీవుడ్ లో ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ భరత్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా కియరా అద్వాని హీరోయిన్ గా చేస్తుంది. తెలుగులో ఈ రేంజ్ క్రేజ్ సంపాదించిన అమ్మడు బీ టౌన్ లో మాత్రం డిఫరెంట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది.


అందులో భాగంగానే నెట్ ప్లిక్స్ ప్రెజెంట్ చేస్తున్న లస్ట్ స్టోరీస్ లో నటించింది. బాలీవుడ్ నలుగురు దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ లో కియరా అద్వాని హాట్ లుక్ లో అందరికి షాక్ ఇచ్చింది. అక్కడ ఎం.ఎస్ ధోని సినిమాలో నటించిన అమ్మడు ఆ తర్వాత ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది.


ఇక ఇలాంటి టైంలో లస్ట్ స్టోరీస్ లో ఛాన్స్ రాగానే చేసింది. ఈమధ్యనే రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ ట్రీలర్ లో కియరా స్టిల్స్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భరత్ హీరోయిన్ ను ఇలా ఎవరు ఊహించి ఉండరని కామెంట్లు వస్తున్నాయి. భరత్ అనే నేనులో వసుమతి ఇలా మతులు పోగొట్టే అందాలతో దర్శనమివ్వడం అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు సీక్రెట్ ఎఫైర్ అంటూ లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ లో చేయడం కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: