రానురాను భారత్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వాహనదారుల రక్షణ నిమిత్తం రోడ్ల మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రమాదనివారణ కార్యక్రమాలు చేపట్టినా, కఠినతరమైన రోడ్డు నిబంధనలు, చట్టాలు తీసుకొస్తున్నా అవి మాకు కాదు అనేలా వాహనదారులు వాటిని పెడద్రోవన పెడుతున్నారు. వారు మాత్రమే ప్రమాదాలకు గురి అవకుండా వారి తప్పిదాల వల్ల ఇతరుల నిండు జీవితాలను కూడా బలి చేస్తున్నారు.


తాజాగా ఒక వాహనదారుడు చేసిన నిర్వాకానికి ఒక నటి తన ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భోజ్ పురి నటి మనీషా  రాయ్ ఈ రోజు అక్కడి బల్లియ ప్రాంతంలోని చిట్టోవ్ని గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయారు. సహనటుడు సంజీవ్ మిశ్రా తో కలిసి షూటింగ్ లో పాల్గొనే నిమిత్తం ఆమె అతనితో కలిసి బైక్ పై వెళుతుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక కారు వారు ప్రయాణిస్తున్న బైక్ ను తగలడంతో వారిద్దరు ఒక్కసారిగా బైక్ నుండి కిందకు పడిపోయారు.


ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప  గాయాలవగా, నటి మనీషా మాత్రం తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించగా, అక్కడికి చేరేలోపే ఆమె మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఆమె మృతిపట్ ల భోజ్  పురి చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురి అయింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో వున్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని మీడియాకు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: