ఆ మద్య నానీ నటించిన మజ్ఞు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ అను ఇమ్మాన్యుయేల్. కంటిచూపుతోనే మత్తుమందు జల్లే ఈ అమ్మడుకి అదృష్టం కలిసి వచ్చి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. వెంటనే మెగా హీరో బన్నీ సరసన ‘నాపేరు సూర్య’ లో నటించింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చైతూ హీరోగా తెరకెక్కుతున్న శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. స్టార్ హీరోలతో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడు తాజాగా రవితేజకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
శ్రీను వైట్ల- రవితేజ కాంబినేషన్లో తెరకెక్కనున్న అమర్ అక్భర్ ఆంటోని సినిమాలోను అను ఎమ్మాన్యుయేల్ని కథానాయికగా తీసుకున్నారు. కాని డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వలన అను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అమర్ అక్భర్ ఆంటోని మూవీ చిత్రీకరణ చిత్రీకరణ 50 రోజుల పాటు అమెరికాలో జరుగనుందట. ఈ 50 రోజుల షెడ్యూల్కి అను డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోవడం వల్లనే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లుగా నిర్మాతలు తెలిపారు.
ప్రస్తుతం నాగ చైతన్యతో నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ డేట్స్ క్లాష్ అవుతున్నాయట..దాంతో రవితేజ సినిమాలో నటించలేనని ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా ఆమె తెలిపింది. అంతేకాదు ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్ర యూనిట్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపింది అను.
దాంతో రవితేజ సరసన నటించేందుకు లియానా , శృతి హాసన్ పేర్లని పరిశీలిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్గా ఎవరినీ తీసుకుంటారు అనేది చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేస్తారట. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో ఈ మూవీ అంచనాలు పెరుగుతున్నాయి.