దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సూపర్ స్టార్ మహేష్ సరసన పోకిరి సినిమాలో నటించి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఇలియానా ఇక్కడ ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించి బాలీవుడ్ నుండి ఒక్క ఛాన్స్ రాగానే అక్కడకి చెక్కేసింది. బర్ఫి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇల్లి బేబ్ అక్కడ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు.


ఏదో అడపాదడపా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ చిట్టి నడుము చిన్నది తెలుగులో మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం ఏమాత్రం కాంప్రైజ్ అవనని చెబుతుందట. టాలీవుడ్ ప్రేక్షకులకు తన అందాల విందు ఇచ్చేందుకు రెడీ అయ్యిందట గోవా బ్యూటీ ఇలియానా.


ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందు అను ఇమ్మాన్యుయెల్ అనుకున్న ఈ రోల్ లో ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుండటంతో ఆమెను పక్కకు పెట్టి ఆమె ప్లేస్ లో ఇలియానాని దించుతున్నారట.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇలియానా కాకుండా శృతి హాసన్, కాజల్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది. మొత్తానికి ఇలియానా చాలా రోజుల తర్వాత తెలుగు తెర మీద కనిపించనుంది. మరి ఈ అవకాశాన్ని అమ్మడు ఎలా వాడుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: