ఈ  మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.  రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన నియమనిబంధనలు తీసుకు వస్తున్నా..ప్రమాదాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు.  డ్రైవర్ల నిర్లక్ష్యం..మద్యం సేవించి వాహనాలు నడపడం..ప్రకృతి విపత్తువల్ల జరిగే ప్రమాదాల వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.   

తాజాగా ప్రముఖ ‘స్టార్‌ మా’యాంకర్‌, నటుడు మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Image result for లోబో రోడ్డు ప్రమాదం
మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం లోబో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్‌ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: