తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్లుగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు అనసూయ, రష్మిలు. జబర్ధస్త్ కామెడీ షోలో మొదట యాంకర్ గా అనసూయ ఎంట్రీ ఇచ్చింది.ఈ ప్రోగ్రామ్ తో యాంకర్ అనసూయకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఇతర ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేయడం..కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో జబర్ధస్త్ కామెడీ షో కి దూరమైంది. ఆమె స్థానంలో యాంకర్ రష్మిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే అనసూయ కన్నా రష్మి అతి తక్కువ కాలంలో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడికి వెండితెరపై కూడా ఛాన్సులు వచ్చాయి.
ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే..బుల్లితెరపై తన సత్తా చాటుతుంది రష్మి. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో పలు షాపింగ్ మాల్స్, మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్సవాలకు రష్మి హాజరవుతోంది. ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండే హీరోయిన్ రష్మికి కోపం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని తెలుగు సంస్థ 'నాటా' నిర్వాహకులు... తమ ఈవెంట్ కు హీరో ప్రభాస్, డైరెక్టర్ శ్రీను వైట్లతో కలసి రష్మి హాజరవుతోందని ప్రచారం చేసుకున్నారు.
తాజాగా ఓ ఈవెంట్కు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, డైరెక్టర్ శ్రీనువైట్లతో కలిసి రష్మి హాజరవుతోందంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రచారం రష్మి వరకు వెళ్లడంతో ఆమె ఆగ్రహంగా స్పందించింది. నా అనుమతి లేకుండానే నా ఫొటో ఎలా వేస్తారు? ఈ ఈవెంట్ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నా అనుమతి లేకుండా నా ఫొటోలను వేయడం ఇదే మొదటి సారి కాదు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చెక్ చేయరా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.