గతవారం జరిగిన కర్ణాటక ఎన్నికలు రాజకీయ నాయకులకు నిద్రపట్టనివ్వలేదు. అయితే యడ్యూరప్ప తన ఎమ్మెల్యేల బలం నిరూపించుకోలేక రాజీనామా చేయడం, గవర్నర్ కుమార స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం మాత్రం చకచకా జరిగిపోయాయి. అయితే ఎన్నికల తరువాత సీఎం గారి భార్య రాధికా కుమారస్వామి మాత్రం ట్రెండింగ్ లో ఉన్నారు. నెటిజన్లు ఆమె కోసమే అంతర్జాలములో శోధిస్తున్నారు.


కాగా రాధికా కుమారస్వామి స్వతహాగా నటి కావడం విశేషం. పెళ్లికి ముందు కన్నడ  పరిశ్రమతో పాటు, తెలుగు ఇండస్ట్రీలలో ఆమె పనిచేశారు. అయితే నందమూరి తారకరత్న హీరోగా 2004లో విడుదలయిన భద్రాద్రిరాముడు సినిమాతోనే ఆమె హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేయడం విశేషం. హీరోయిన్ గా ఉన్న సమయంలోనే కుమారస్వామితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడంతో ఆమె అప్పటితో సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది.


కాగా ఆమె మళ్ళీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా తెలుగు సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వబోతుందట. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన కాంట్రాక్ట్‌ అనే తెలుగు సినిమాలో ఒక కీలకమైన పాత్రకు రాధికా కుమారస్వామిని సంప్రదించారట. ఈ పాత్ర ఆమెకు నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకుందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: