బాహుబలితో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి చిత్రం తర్వాత మనోడు రాజమౌళి దర్శకత్వం వహించి ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలకే పరిమితం అయ్యాడు. ఈ చిత్రాల కోసం ప్రభాస్ ఎంతో డెడికేషన్ గా వర్క్ చేశారు. మద్యలో ఏ చిత్రంలో కూడా నటించకుండా తన టైమ్ మొత్తం బాహుబలి సీరీస్ కోసమే వినియోగించాడు. బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్నాడు.
ప్రపంచ భాషల్లో విడుదలై విజయం సాధించడంతో ప్రభాస్ నటించే కొత్త సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. సుమారు 200 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. యాక్షన్ నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా కోసం అబుదాబిలో భారీ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం తొంభై కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సన్నివేశాల్లో ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న విదేశీ కార్లను, ట్రక్కులను ఉపయోగిస్తున్నారు.
సాహోలో సంట్స్ సహజత్వంగా ఉంటాయి. అలా ప్లాన్ చేశాం. ఇందులో తొంబై శాతం రియల్, కేవలం పది శాతమే గ్రాఫిక్స్ ఉంటాయని స్పష్టం చేశారు. శర్దాకపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.హాలీవుడ్ సినిమా స్థాయిలో స్టంట్స్ ఉంటాయని చిత్రబృందం తెలిపింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్యంలో యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు.