ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో దుల్కన్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ నటించిన ‘మహానటి’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి కలెక్షన్లు రాబడుతుంది. ఇక మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. 
Image result for yatra movie
ఈ సినిమా ముహూర్తం రెడీ అయినా..దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆ స్థానంలో క్రిష్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’సినిమా మంచి విజయం సాధించింది.  ఇదిలా ఉంటే ఇప్పుడు రాజకీయ నాయకులపై కూడా బయోపిక్ తీయబోతున్నారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌లోను భూమిక న‌టిస్తుంద‌ని స‌మాచారం.
Image result for yatra movie
వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.ఆనందోబ్ర‌హ్మ చిత్రం ఫేమ్ మ‌హీ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో వైఎస్ఆర్ బ‌యోపిక్‌ రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే. యాత్ర అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుదలై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది.
Image result for yatra movie
గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం వంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన మ‌మ్ముట్టి పాతికేళ్ల త‌ర్వాత యాత్ర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు వైఎస్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి(బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ఫేం) నటిస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: