బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక చోప్రా తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు బాలీవుడ్ లో నటిస్తున్న సమయంలోనే హాలీవుడ్ లో క్వాంటికో సిరియల్ లో నటించింది. క్వాంటికో కొన్ని హాట్ సీన్లు ఆ మద్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ‘ఎ కిడ్ లైక్ జేక్’,‘ఇజింట్ ఇట్ రొమాంటిక్’ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాలు పూర్తి అయిన తర్వాత బాలీవుడ్ లో మళ్లీ ఎంట్రి ఇవ్వబోతుంది. సల్మాన్ నటిస్తున్న ‘భరత్’ అనే చిత్రంలో నటించబోతుంది. ఆ తర్వాత సోనాలి బోస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. ఇది ‘ఇమ్యునోడెఫిషియన్సీ’ వ్యాధితో (రోగ నిరోదక శక్తి లోపించడం) మృతి చెందిన 18 ఏళ్ల మహిళ అయేషా చౌదరి జీవిత నేపథ్యంలో రూపొందనుంది.
ఈ చిత్రంలో అయేషా పాత్రలో దంగల్ ఫేం జైరా వసీమ్ నటించనుండగా, ఆమె తల్లి పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తారట. ఇక ప్రియాంక భర్తగా అభిషేక్ బచ్చన్ నటిస్తాడని సమాచారం. ఇప్పటి వరకు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన ప్రియాంక ఇప్పుడు తల్లి పాత్రలో ఎలా మెప్పించగలదో చూడాలి. ఈ మద్య దీపికా పదుకొనె కూడా గ్లామర్ పాత్రల్లో కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ పాత్రతో దీపికా పదుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక తల్లి పాత్రలో నటించి మెప్పించబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నారు.