తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకు పోతుంది ‘మహానటి’. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన బ‌యోపిక్ మ‌హాన‌టి. తెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధిస్తుంది.  చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమాని ఆద‌రిస్తున్నారు. 
Image result for mahanati
ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుంది. గతంలో సావిత్రి జీవితంపై రక రకాల కథనాలు సోషల్ మీడియాలో వచ్చినా..మ‌హాన‌టిలో సావిత్రి జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌డంతో ఆ త‌రం వారు మ‌హాన‌టి మూవీ చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. అప్పట్లో సావిత్రిపై అభిమానం ఉన్న 50 ఏళ్ళ‌కి పైబ‌డిన వ‌య‌స్సు వారు కూడా మండే ఎండ‌ల‌లో ఈ సినిమా చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌రకి వ‌స్తున్నారు. 
Image result for mahanati
ఈ సినిమాలో మరో ప్రత్యేక ఏంటంటే..జెమినీ గణేష్ పాత్రలో నటించిన దుల్కన్ సల్మాన్ తప్ప మిగతా అందరూ అగ్రనటులు కావడం విశేషం.  సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండె లాంటి నటులతో సినిమాకు మంచి వన్నె వచ్చింది.  అంతే కాదు ఆయా పాత్రలకు తగ్గట్టుగా అద్భుతమైన నటన కనబరిచారు. అయితే సావిత్రి సినిమా చూడటానికి మండుటెండ్లో వస్తున్న వయసు పైబడిన వారికి  వైజ‌యంతి మూవీస్ వారు తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.
Image result for mahanati
జూన్ మూడో వారం మ‌హాన‌టి మీ ద‌గ్గ‌రికే వ‌స్తుంది. త‌న త‌రం వారి ద‌గ్గ‌ర‌కి త‌ర‌లి వ‌స్తుంది అని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఓల్డేజ్ హోమ్‌లో మ‌హాన‌టి చూస్తూ సంబ‌రాలు చేసుకోండి అని అన్నారు. అయితే ఇందుకు చేయ‌వ‌ల‌సింది మీ డీటెయిల్స్ vyjayanthimahanati@gmail.comకి పంపించడమే. మ‌రి మహాన‌టి చిత్రం బృందం ఇచ్చిన ఆఫ‌ర్‌ని మీరు స‌ద్వినియోగం చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: