దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పడూ..ఇప్పుడూ మెగాస్టార్ నెంబర్ వన్ అని ఈ చిత్రంతో నిరూపించారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ జనాలు నీరాజనాలు పలికారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా. చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నటులే కాకుండా బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరో బాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో భాగం కానున్నాడని తెలుస్తుంది. ఆ మద్య అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా కనిపించి ఎంతోమంది తెలుగు ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు బోజ్పురి యాక్టర్ రవికిషన్.
ఆ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకన్న రవికిషన్ తర్వాత కిక్ 2, లై, ఎమ్మెల్యే చిత్రాల్లో నటించారు. జోద్ పూర్ ఇండస్ట్రీలో రవి కిషన్ హీరోగా కూడా నటించారు. రవికిషన్ సైరాలో బ్రిటీష్ వారికి వ్యతిరేఖంగా పోరాడిన పల్లెటూరి వ్యక్తిగా కనిపించబోతున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్పై రామ్ చరణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తుండగా, సంగీత దర్శకుడి విషయంలో క్లారిటీ రావడం లేదు.