టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కష్టపడి తీసిన ‘మెహబూబా’ ఫెయిల్ అవ్వడంతో ఆమూవీని నిర్మించిన పూరీకి సుమారు 15 కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారు. దీనితో పూరి కోలుకోలేని షాక్ లో ఉన్నాడని సమాచారం. దీనికితోడు ఈమూవీ ప్రాజెక్ట్ కు ఛార్మీ కూడ సహ నిర్మాతగా వ్యవహరించడంతో ఆమెకు కూడ నాలుగు కోట్ల వరకు నష్టం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
ఈ నష్టాల నుండి ఎలా బయటపడాలి అన్న చర్చలు ప్రస్తుతం పూరి కాంపౌండ్ లో జరుగుతున్నట్లు టాక్. పూరి కథ చెపుతాను అని అడిగినా టాప్ హీరోలు ఎవ్వరు ఆసక్తి కనపరచని నేపధ్యంలో ఈసమస్యలకు పరిష్కారం వెతికే బాధ్యతను ఛార్మీ తీసుకుని ఈవిషయం పై కొన్ని రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రాయబారాలలో భాగంగా ఛార్మీ నాగార్జునతో నడిపిన రాయబారానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 
సంబంధిత చిత్రం
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం పూరి తీయబోయే సినిమాలో హీరోగా నటించడానికి నాగార్జున అంగీకారం తెలపడం వెనుక ఛార్మీ చేసిన రాయబారం వ్యూహాత్మక ఫలితాన్ని ఇచ్చింది అని అంటున్నారు. నాగార్జునకు మళ్ళీ ‘శివమణి’ లాంటి మంచి సబ్జెక్ట్ పూరి తయారు చేస్తాడు అన్న నమ్మకాన్ని నాగ్ కు ఛార్మీ తన మాటల చాకచక్యంతో కలిగించింది అని అంటున్నారు. 
CHARMEE ALONG WITH PURI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
పూరి జగన్నాథ్ ఇప్పటికే తయారు చేసిన మూడు కథలలో ఎదో ఒక కథను నాగార్జునకు చెప్పి ఒప్పించి ఈ కష్టాల నుండి బయటపడాలని పూరి వ్యూహం అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వర్మను నమ్ముకుని ‘ఆఫీసర్’ ప్రయోగం చేసి ఆమూవీ ఫలితం గురించి టెన్షన్ పడుతున్న నాగార్జున అంత సులువుగా పూరి బుట్టలో పడడు అని అంటున్నారు. కేవలం ప్రస్తుతం పూరి పై ఉన్న ఆర్ధిక ఒత్తిడిలను తగ్గించుకోవడానికి ఇలాంటి లీకులు వ్యూహాత్మకంగా పూరి టీమ్ ఇస్తోంది అనే వాదన కూడ ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: