ఆ మద్య వడ్డే నవీన్ నటించిన ‘పెళ్లి’ చిత్రంలో ‘రుకు రుకు రుక్మిణి రమణ సుగుణ మని’ పాటతో ఉర్రూతలూగించిన నటుడు ఫృధ్విరాజ్..తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు.  ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు..తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఫృథ్విరాజ్ ఎన్నో చిత్రాల్లో నటించారు.  ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.  చాలా కాలం తర్వాత పృథ్వీరాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని మనసు కదిలించే మాటలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫృథ్విరాజ్ మాట్లాడుతూ..తెలుగు తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ మెప్పించానని..పెళ్లి చిత్రంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.

"నాకు సినిమానే ప్రపంచం .. ఏ పాత్ర ఇచ్చినా ఎంతో అంకితభావంతో చేస్తాను. అంతేగానీ ఎదుటివాళ్లను డామినేట్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం ఉండేది కాదు. ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఉన్నఫలంగా కనిపించకుండా పోవడం కారణాలు ఏంటీ..చాన్సులు లేకనా..పరాజయాలు ఎదురుకావడమే అందుకు కారణమా? ప్రశ్నకు ఫృథ్వి షాకింగ్ సమాధానం ఇచ్చారు.  అవును మీరు అన్నది నూటికి నూరుశాతం నిజం..కానీ అతి సినికెరీర్ పరంగా కాదు..నా పర్సనల్ లైఫ్ పరంగా అన్నారు.   

తనకు ఒకే ఒక బాబు అని..చాలా అందగాడు..చిన్నప్పటి నుంచి వాడిని చాలా గారాబంగా పెంచుకున్నాం. అయితే వాడు ఎదుగుతున్న సమయంలో మా నాన్నకు ఓ చిన్న అనుమానం వచ్చింది..వెంటనే మా బాబుని ఆసుపత్రి చూపించిన తర్వాత డాక్టర్ మాకు దిమ్మతిరిగే నిజం చెప్పారు.

మా బాబుకు మానసికపరమైన ఎదుగుదల లేదనే విషయం తెలిసి షాకయ్యాము. దగ్గరుండి అన్ని విషయాలు మేమే చూసుకోవాలని డాక్టర్ చెబితే .. బాధను భరిస్తూనే ఆ నిజాన్ని స్వీకరించాం. ఆ బాబు కోసమే సమయమంతా కేటాయించాలి గనుక ఒక్కరు చాలనుకున్నాం .. ఇప్పుడు వాడి వయసు 22 యేళ్లు" అంటూ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: