నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సవ్య సాచి’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. చైతు మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెడుతున్న ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ మూవీలోని అప్పటి సూపర్ హిట్ సాంగ్ 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' ను రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ స్పెషల్ సాంగ్ కు భారీ క్రేజ్ తీసుకురావడానికి ఈసాంగ్ లో నటించేందుకు రకుల్ కాజల్ ల ను ఈమూవీ నిర్మాతలు విపరీతంగా ట్రై చేసారు. ముందుగా ఈసాంగ్ లో రకుల్ అనుకుంటే ఆమె చైతు పక్కన స్పెషల్ సాంగ్ లో చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదని టాక్. ఈమూవీ నిర్మాతలు కాజల్ ను అడిగితే ఆమె సింపుల్ గా నో అని చెప్పేసింది అని వార్తలు వస్తున్నాయి.
ఆ తరువాత రాశీ ఖన్నాఇక చివరిగా శృతిహాసన్ ఇలా చాలమంది టాప్ హీరోయిన్స్ ను సంప్రదించినా వారంతా రకరకాల కారణాలతో ఈస్పెషల్ సాంగ్ పట్ల తమ అయిష్టాన్ని వ్యక్తపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈహీరోయిన్స్ అంతా గతంలో చైతన్యతో నటించిన హీరోయిన్స్ అయినా ఇప్పుడు ఇలా చైతన్యతో ఈసాంగ్ చేయడానికి ఆసక్తి కనపరచకపోవడం హాట్ న్యూస్ గా మారింది.
దీనితో ఇకలాభం లేదు అనుకుని ‘సవ్య సాచి’ నిర్మాతలు 50 లక్షల భారీ పారితోషికం ఇచ్చి ఈ ఐటమ్ సాంగ్ కు తమన్నాను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమన్నా తెలుగు సినిమాలలో చాలా ఐటమ్ సాంగ్ లు చేసినా టాప్ హీరోయిన్స్ అంతా చైతు పక్కన ఎవరూ చేయమని చెప్పిన నేపధ్యంలో మరోమార్గం లేక చిట్ట చివరకు తమన్నాకు ఓటు వేసినట్లు సమాచారం. గతంలో నాగార్జున పక్కన రమ్య క్తిష్ణ ఈసాంగ్ లో స్టెప్స్ వేస్తే ఇప్పుడు చైతన్య పక్కన తమన్నా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయబోతోందిఅనుకోవాలి..