టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున్న పోరాటం చేసింది.  ఆమె పోరాటానికి నెలరోజుల తర్వాత మంచి స్పందన రావడం..సహాయం చేయడానికి వచ్చారు. దాంతో శ్రీరెడ్డి అనూహ్యంగా జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాన్, తల్లిని దారుణంగా దూషించిన తరువాత శ్రీరెడ్డికి చిక్కులు మొదలయ్యాయి.  అప్పటి నుంచి ఆమెకు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చుక్కులు చూపించారు. దాంతో శ్రీరెడ్డి ఇంటికే పరిమితం అయ్యింది..అయినా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుండడంతో ఈ పరిస్థితి ఎక్కువవుతూనే ఉంది.
Image result for sri reddy
తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా పవన్ ఫాన్స్ కు ఎమోషనల్ అప్పీల్ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఫాన్స్ చచ్చిపోతాం అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాట అనే ముందు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించారా.. ఎవరి కోసమేమో చావడానికేనా వారు మిమ్మలి కన్నది.. ఇలాంటి కామెంట్స్ ఆపి మీ తల్లిందండ్రుల గురించి ఆలోచించండి అంటూ శ్రీరెడ్డి పవన్ ఫాన్స్ ని కోరింది. ఓ వైపు పవన్ కళ్యాన్ ప్రజల కోసం కష్టపడుతున్నాను..ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని అంటున్నారు.
Image result for sri reddy pawan kalyan
అందుకే తాను పవన్ కళ్యాన్ ని గుడ్డిగా నమ్మానని..కానీ ఆ సమయంలో ఆయన ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకోవడంతో నాలో ఆవేశం కట్టలు తెంచుకుందని..పొరపాటున మాట ఒక్క మాట అన్నానని..అందుకు ఎన్నో సార్లు వారి కుటుంబానికి ముఖ్యంగా పవన్ తల్లిగారిని క్షమాపణలు కోరానని అన్నారు.
Image result for sri reddy pawan kalyan
సరే నేను పొరపాటున మాట్లాడాను..కానీ మీకందరికీ ఆలోచించే కెపాసిటీ ఉండి కూడా ఏంచేస్తున్నారు.. బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తనకు ఏ రాజకీయ పార్టీతో కానీ, మీడియాతో కానీ సంబంధాలు లేవని శ్రీరెడ్డి తెలిపింది. తాను కేవలం సమాజం, న్యాయం తరుపున మాత్రమే నిలబడతానని శ్రీరెడ్డి పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: