తెలుగులో ‘వైశాలి’ లాంటి హర్రర్ సినిమా పరిచయం అయిన ఆదిపినిశెట్టి తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగు లో కన్న తమిళంలో మంచి సక్సెస్ సాదించిన ఆది ఆ మద్య అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాతో విలన్ గా నటించి మంచి మార్కులే కొట్టేశాడు. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న చిత్రానికి 'నీవెవరో' టైటిల్ ఫిక్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా టైటిల్ లోగో గురువారం విడుదల చేశారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image result for rangasthalam aadi

 కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా 2017లో వచ్చిన 'నిన్ను కోరి' సినిమా మంచి విజయం సాధించింది. అందులో నాని హీరోగా నటించగా ఆది పినిశెట్టి కీలకమైన పాత్ర చేశారు. ఆ షూటింగ్ సమయంలోనే ఆది హీరోగా సినిమా చేయాలని నిర్మాతలు డిసైడ్ అవ్వగా ఎట్టకేలకు 'నీవెవరో' ప్రారంభం అయింది.  

Image result for tapsee anando brahma

ఇంతకు ముందు ఆది, తాప్సీ కలిసి ‘గుండెల్లో గోదారి' చిత్రంలో కలిసి నటించారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్టయింది. వెంకటేష్ మూవీ ‘గురు' సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితికి సింగ్‌కు ‘నీవెవరో' రెండో చిత్రం.
Ritika Singh shocking new look
రంగస్థలంతో ఆది, ఆనందో బ్రహ్మతో తాప్సీ, గురు చిత్రంతో రితికా సింగ్ మంచి విజయాలు సాధించారు..అంతే కాదు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు కలిసి నటించబోచే సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం.  టైటిల్ చాలా బాగుందని..నీవెవరో' మూవీ టైటిల్ లోగో లాంచ్ చేసిన సందర్భంగా నాని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: