‘భరత్ అనే నేను’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక వెరైటీ మూవీని చేస్తున్న మహేష్ స్పీడ్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి ఊహించని షాక్ ఇచ్చింది అన్నవార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ప్రాజెక్ట్ విషయంలో తమ పివిపి సంస్థకు అన్యాయం జరిగింది అంటూ ఈసంస్థ అధినేత పొట్లూరి ప్రసాద్ మహేష్ తో పాటు ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న వంశీ పైడిపల్లికి అదేవిధంగా నిర్మాతలు దిల్ రాజు అశ్వినీదత్ లకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 
MAHESH LATEST PHOTOS IN BHARAT ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈకోర్టు నోటీసులకు సంబంధించిన కోర్టు హియరింగ్ జూన్ లో ఉన్న నేపధ్యంలో ఎలర్ట్ అయిన మహేష్ ఈవిషయం మరింత సాగతీయకుండా నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫ్లాప్ తరువాత మహేష్ పివిపి సంస్థను ఆదుకోవడానికి మరోసినిమా చేస్తాను అని మాట ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు హడావిడి చేసాయి. 
సంబంధిత చిత్రం
అయితే ఈవిషయాలను మర్చిపోయిన మహేష్ తన మాట తప్పి ప్రస్తుతం పివిపి తో కాకుండా దిల్ రాజ్ అశ్వినీదత్ ల కాంబినేషన్ లో సినిమాను ప్రారంభిస్తున్న నేపధ్యంలో తనకు ఇచ్చిన మాటను మహేష్ తప్పాడు అంటూ పివిపి ప్రసాద్ వాదన. దీనితో ఈసున్నితమైన సమస్యను పరిష్కరించే విధంగా మహేష్ వంశీ పైడిపల్లితో తాను చేస్తున్న సినిమాకు పివిపి ని కూడ భాగస్వామిగా చేయాలని ప్రిన్స్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. 
MAHESH LATEST PHOTOS IN BHARAT ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈ ప్రపోజల్ కు దిల్ రాజ్ అశ్వినీదత్ లు అంగీకరిస్తారా. ఒకవేళ అది జరిగినా వీరి కండిషన్స్ కు పివిపి సంస్థ ఒప్పుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్ లో ఇప్పటివరకు ఎవరూ చూపించని మాస్ బాడీ లాంగ్వేజ్ ని చూపెడుతూ వంశీ పైడిపల్లి చేయబోతున్న ప్రయోగానికి ఆదిలోనే పివిపి ద్వారా అడ్డంకులు ఏర్పడటంతో ఈసున్నిత సమస్యను ఎవర్నీ నొప్పించకుండా ఎలా పరిష్కరిస్తాడు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: