2006 లో తెలుగులో వచ్చిన మాయాజాలం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి పూనమ్ కౌర్. తెలుగులో హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నా సరైన హిట్ లేకపోవడంతో ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతున్నా సరైన ఫేమ్ సంపాదించలేకపోయింది. మధ్యలో సపోర్టింగ్ పాత్రలు చేసినా దానివల్ల పేరొచ్చింది అంతంత మాత్రమే. 


కాగా మొన్న ఈ మద్య ఒక ఫిలిం క్రిటిక్ ఒక స్టార్ హీరోని విమర్శిస్తున్నప్పుడు మధ్యలో దూరి ఆ క్రిటిక్ దెబ్బకి నలిగిపోయింది. మీరు నోరుతెరచి నన్ను కాపాడనండి అని వేడుకున్నా ఆ హీరో స్పందించకపోవడంతో ఎలాగోలా ఆ సమస్య వదలిపోవడంతో ఊపిరిపీల్చుకుంది. అయినా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని విమర్శలు చేయడం ఇంకా మానలేదు. మొన్ననే ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పిన ఆమె నేడు ఒక డైరెక్టరు పై విరుచుకుపడింది.


అతను మోసం చేసినట్లుగా గల ఉద్దేశ్యంతోట్విట్టర్లో  ఒక ట్వీటు చేసింది. ఒక డైరెక్టర్ తనకు తెలిసిన నాలుగు పెద్ద కుటుంబాలకు ఒక ఎన్నారై హీరోయిన్ ని  విస్తరింపజేశాడంటూ ట్వీటు చేసింది. నాకు హిట్ లేదు సరే! ఆమెకు ఉందా? అని ప్రశ్నించింది. ఇంకో ట్వీటులో జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త! నమ్మకద్రోహి అంటూ ట్వీటు చేసింది. అయితే ఈమె చేసిన ట్వీటు కేవలం ఒక స్టార్ హీరోతో సన్నిహితంగా మెలుగుతున్న ఒక పెద్ద దర్శకుడు గురించే అని గుసగుసలు వినపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: