ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరియర్ సాగించాడు. సరైన హిట్ పడితే తన సత్తా చెప్పే దమ్ము ఉన్నా రంగస్థలం ముందు దాకా అది కుదరలేదు. కాని ఎప్పుడైతే రంగస్థలం వచ్చిందో టాలీవుడ్ అందరి దృష్టి సుకుమార్ మీద పడింది. రాం చరణ్ లోని నటుడిని ఆవిష్కరించిన సుక్కు రంగస్థలం తో టాప్ లీడింగ్ లోకి వెళ్లాడు.


ఇక ఈ సినిమాకు ముందు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం మనవాడి రేంజ్ మాములుగా లేదు. సినిమాకు 18 కోట్లు ఇస్తేనే అంటూ డిమాండ్ చేస్తున్నాడట సుకుమార్. అంతేనా లాభాల్లో వాటా కూడా అడుగుతున్నాడట. రంగస్థలం తర్వాత మైత్రి మొవీ మేకర్స్ తోనే మహేష్ సినిమా చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాకు 18 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట.


మహేష్ తో ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశాడు సుకుమార్. ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. కాని రంగస్థలం మాత్రం సుకుమార్ ను నిలబెట్టింది. ఇక మహేష్ కు హిట్ ఇచ్చే క్రమంలో థ్రిల్లర్ కథతో వస్తున్నాడట. ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట.


ఆలెడీ మహేష్ శ్రీమంతుడు సినిమాతోనే నిర్మాణ రంగంలోకి దిగారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం భరత్ అనే నేను సూపర్ హిట్ కొట్టిన మహేష్ తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: