నందమూరి బాలకృష్ణ కెరియర్ లో సిం హా సినిమా చాలా ఇంపార్టెంట్.. ఆ సినిమాకు ముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని రొటీన్ అనిపించుకోవడంతో సిం హాగా బోయపాటి బాలకృష్ణ కెరియర్ కు ఓ మంచి బూస్టప్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత లెజెండ్ కూడా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన సినిమానే.. అది కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతుందట.


ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా నిర్మాతగా బాలకృష్ణ మారడమే. బోయపాటి శ్రీనుపై ఉన్న నమ్మకంతో ఇప్పుడు చెప్పిన కథ బాగా నచ్చేయడంతో బాలయ్య బాబే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద దృష్టి పెట్టిన బాలకృష్ణ త్వరలోనే వినాయక్ సినిమా మొదలు పెడుతున్నాడని తెలుస్తుంది. 


సి. కళ్యాణ్ ఆ సినిమాను నిర్మిస్తారట. ఇక ఇప్పుడు బోయపాటి సినిమా కోసం బాలకృష్ణ నిర్మాతగా మారాల్సి వస్తుంది. సిం హా, లెజెండ్ తర్వాత ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుంది అన్నది చూడాలి. ప్రస్తుతం బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అది పూర్తయ్యక బాలకృష్ణ సినిమానే ఉంటుందని అంటున్నారు. ఎన్.బి.కే క్రియేషన్స్ లో ఈ సినిమా నిర్మితమవనుందట.


ఇక బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ పై ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఎన్.టి.ఆర్ జయంతి నాడు ఈ సినిమాపై ఓ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఇక జూన్ 10 బాలయ్య బర్త్ నాడు బోయపాటి మూవీ ముహుర్తం పెడతారని అంటున్నారు. మొత్తానికి యువ హీరోలకు ఏమాత్రం తగ్గని బాలయ్య జోరు చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: